ఉత్తరప్రదేశ్ను భారీ తుపాను గజగజలాడించింది. బుధవారం భదోహి, బుదౌన్ జిల్లాల్లో భారీ వర్షం కకావికలం చేసింది. దీంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు, ఇళ్లు కూలిపోయాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 11 మంది చనిపోగా.. అనేక మంది గాయాలు పాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారం అలుముకున్నాయి. ఇక మొబైల్ నెట్వర్క్లు నిలిచిపోయాయి. ఇక సమాచారం అందుకున్న అధికారులు సహాయ చర్యలు చేపట్టారు.
ఉత్తరప్రదేశ్లోని భదోహి, బుడౌన్ జిల్లాల్లో భారీ వర్షాలతో కూడిన బలమైన తుఫాను కారణంగా బుధవారం పదకొండు మంది మరణించారని అధికారులు తెలిపారు. భధోయ్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయని, ఇళ్లు దెబ్బతిన్నాయని పలు ప్రాంతాల నుంచి సమాచారం వస్తున్నాయని అదనపు జిల్లా మేజిస్ట్రేట్ కున్వర్ వీరేంద్ర కుమార్ మౌర్య తెలిపారు. తుఫాను కారణంగా మొబైల్ నెట్వర్క్లకు అంతరాయం కలగడంతో పునరుద్ధరణ, సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురయ్యాయని అన్నారు. జిల్లాలోని అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారని మౌర్య తెలిపారు.




