Air India: పశ్చిమాసియా యుద్ధం, ఇంధన సంక్షోభంతో భారత్ సహా ప్రపంచదేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ పొదుపు సూచనలు చేశారు. విదేశీ ప్రయాణాలు తగ్గించుకోవడంతో పాటు ఇంధన పొదుపు చేపట్టాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. తన అంతర్జాతీయ కార్యకలాపాలను తగ్గిస్తున్నట్లు ఎయిర్ ఇండియా అధికారికంగా ప్రకటించింది.
Read Also: Electric Vehicle: EV యజమానులకు కేంద్రం గుడ్ న్యూస్..
ఎయిర్ ఇండియా పలు ఇంటర్నేషనల్ రూట్లలో విమానాల సంఖ్యను తగ్గించింది. ఆగస్టు 2026 వరకు నెలకు 1200కు పైగా అంతర్జాతీయ విమానాలను నడపడం కొనసాగించాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది. దీనిలో భాగంగా ఉత్తర అమెరికాకు వారానికి 33 విమాన సర్వీసులు, యూరప్కు వారానికి 47 విమాన సర్వీసులు, యూకేకు వారానికి 57 విమాన సర్వీసులు, ఆస్ట్రేలియాకు వారానికి 8 విమాన సర్వీసులు, ఫార్ ఈస్ట్, సౌత్-ఈస్ట్ ఆసియా, సార్క్ ప్రాంతాలకు వారానికి 158 విమాన సర్వీసులు, మారిషస్కు (ఆఫ్రికా) వారానికి 7 విమాన సర్వీసులు నడుపనున్నారు.




