తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో కీలక పరిణామం చోటుచేసుకుంది. 1995 , 1996 బ్యాచ్కు చెందిన ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) హోదా కల్పిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన జీవో నంబర్ 509 ప్రకారం, వీరికి ‘అబవ్ సూపర్ టైమ్ స్కేల్ (ii)’ గ్రేడ్లో పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఉత్తర్వులు వెలువరించారు.
World Cup 2011: అందుకే 2011 వరల్డ్ కప్లో రోహిత్ శర్మను తీసుకోలేదు.. ‘నన్ను క్షమించు’: శ్రీకాంత్
ఈ పదోన్నతి పొందిన అధికారులలో 1995 బ్యాచ్కు చెందిన వీరిశెట్టి వెంకట శ్రీనివాసరావు, స్వాతి లక్రా, మహేష్ మురళీధర్ భగవత్ ఉండగా, 1996 బ్యాచ్ నుండి చారు సిన్హా, డాక్టర్ అనిల్ కుమార్ , వి.సి. సజ్జనార్లు ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వీరంతా ఇకపై డీజీపీ స్థాయి హోదాలో తమ సేవలను అందించనున్నారు. అయితే, ప్రస్తుతానికి వీరిని వారు నిర్వహిస్తున్న పాత పోస్టుల్లోనే కొనసాగిస్తూ (In-situ) ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అంటే బాధ్యతలలో మార్పు లేకుండానే వారి హోదా , వేతన శ్రేణిని పే మ్యాట్రిక్స్ లెవల్ 16కు పెంచడం జరిగింది.
ముఖ్యంగా ప్రస్తుతం టీజీఎస్ఆర్టీసీ ఎండీగా ఉన్న వి.సి. సజ్జనార్ , కీలక విభాగాల్లో ఉన్న మహేష్ భగవత్ వంటి అధికారులకు ఈ అత్యున్నత హోదా దక్కడం పోలీస్ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొంతకాలంగా ఈ పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో, ప్రభుత్వం ఎంప్యానెల్మెంట్ ప్రక్రియను పూర్తి చేసి ఈ ఆరుగురు అధికారులను డీజీపీ స్థాయికి ప్రమోట్ చేస్తూ తుది నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్తర్వుల ప్రతిని రాష్ట్ర డీజీపీ కార్యాలయంతో పాటు ఇతర సంబంధిత ప్రభుత్వ విభాగాలకు సమాచారం నిమిత్తం పంపడం జరిగింది.




