AP Local Body Election: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన కసరత్తు సాగుతోంది.. అయితే, ఎన్నికల షెడ్యూల్ సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది.. అయితే, వైరల్ అవుతున్న వార్తలపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఎన్నికల షెడ్యూల్కు సంబంధించిన సమాచారం ఫేక్ అని ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్చంద్ర పునేఠా స్పష్టం చేశారు. ఎన్నికల షెడ్యూల్కు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని SEC సూచించారు. అధికారికంగా ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడకముందే షెడ్యూల్ పేరుతో ప్రచారం చేస్తున్న సమాచారాన్ని నమ్మడం లేదా ఇతరులకు షేర్ చేయడం చేయవద్దని హెచ్చరించారు.
అలాగే, ఎన్నికల సంఘం అధికారిక అనుమతి లేకుండా దాని పేరు, లోగోను ఉపయోగించడం చట్టరీత్యా నేరమని అనిల్చంద్ర పునేఠా తెలిపారు. ఎన్నికల సంఘం పేరును, అధికారిక లోగోను దుర్వినియోగం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు.. అయితే, తప్పుడు సమాచారం, అసత్య వార్తలను సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని SEC హెచ్చరించారు. అలాంటి వ్యక్తులపై సైబర్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్కు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని ప్రజలు అప్రమత్తంగా పరిశీలించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించింది. ఎన్నికలకు సంబంధించిన అధికారిక సమాచారం కోసం ఎన్నికల సంఘం అధికారిక ప్రకటనలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. “అసత్య ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దు.. షేర్ చేయవద్దు. తప్పుడు సమాచారం ప్రచారం చేసేవారిపై సైబర్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం.” అని ప్రకటించారు SEC అనిల్చంద్ర పునేఠా..




