Tamil Nadu:తమిళనాడు ఎన్నికలు ముగిశాయి. ఏ కూటమి అధికారంలో వస్తుందనే విషయంపై ఎగ్జిట్ పోల్స్ సంస్థలు కూడా స్పష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించలేదు. కొన్ని ఎగ్జిట్ పోల్స్ డీఎంకే కూటమి అధికారంలోకి వస్తుందని చెబితే, ఒకటి రెండు అన్నాడీఎంకే అధికారం చేపట్టొచ్చని అంచనా వేశాయి. అయితే, ప్రముఖ ఎగ్జిట్ పోల్స్ సంస్థ యాక్సిస్ మై ఇండియా మాత్రం ఈసారి తమిళనాడులో సినీనటుడు విజయ్ పార్టీ టీవీకే 98-120 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. డీఎంకే కూటమి 92-110 సీట్లు, అన్నాడీఎంకే+బీజేపీ కూటమి 22-32 సీట్లు గెలుచుకుంటుందని చెప్పింది.
Read Also: Iran War: ఇరాన్పై దాడికి అమెరికా సిద్ధం.. ట్రంప్ ముందు 3 ప్రణాళికలు..
ఈ నేపథ్యంలో తమిళనాడులో రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. విజయ్ కింగ్ లేదా కింగ్ మేకర్గా నిలిచే అవకాశం ఉండటంతో అన్నాడీఎంకే విజయ్ పార్టీతో టచ్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. టీవీకేతో అన్నాడీఎంకే చర్చలపై దృష్టి సారించింది. యాక్సిస్ మై ఇండియా ప్రకారం.. విజయ్కు 35 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. ఎగ్జిట్ పోల్ ప్రకారం 37 శాతం మద్దతుతో విజయ్ సీఎం పదవికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అభ్యర్థిగా నిలిచారు. ప్రస్తుతం సీఎం ఎంకే స్టాలిన్ 35 శాతంతో రెండో స్థానంలో ఉన్నారు. యువ ఓటర్లలో విజయ్కు బలమైన మద్దతు ఉంది. తొలిసారి ఓటు వేస్తున్న వారు విజయ్కు జై కొట్టినట్లు సర్వే వెల్లడించింది.




