తమిళనాడులో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటికీ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి 108 స్థానాలు వచ్చాయి. విజయ్కు కాంగ్రెస్ మద్దతుగా నిలిచింది. దీంతో విజయ్ బలం 112కు చేరింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజయ్ కోరగా.. గవర్నర్ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. మ్యాజిక్ ఫిగర్ చూపిస్తేనే అనుమతి ఇస్తానని చెప్పారు.
తాజాగా మరోసారి టీవీకే నేత ఆదవ్ అర్జున్, న్యాయ నిపుణులతో కలిసి లోక్భవన్కు వెళ్లి గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ను కలిశారు. రేపటి ప్రమాణస్వీకారానికి అనుమతి ఇవ్వాలని కోరగా.. గవర్నర్ అందుకు నిరాకరించారు. దీంతో లోక్భవన్ నుంచి టీవీకే నేతలు, న్యాయ నిపుణులు వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో రేపటి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని విజయ్ రద్దు చేసుకున్నారు.
ఇదిలా ఉంటే తమిళనాడు రాజకీయాలు తాజాగా కొత్త మలుపు తిరిగినట్లుగా కనిపిస్తోంది. డీఎంకే-ఏఐడీఎంకే కలవబోతున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చిన్న పార్టీలను కలుపుకుని 120 మ్యాజిక్ ఫిగర్ దాటనుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు బద్ధ శత్రువులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.
#WATCH | Tamil Nadu: TVK officials, along with party president Vijay's legal team, leave from Lok Bhavan, in Chennai. pic.twitter.com/wgZ3lpCEdu
— ANI (@ANI) May 6, 2026




