Ranchi RSS attack: జార్ఖండ్ రాజధాని రాంచీలో ఇటీవల ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై పెట్రోల్ బాంబు దాడి జరిగింది. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుల్లో ఒకరు పోలీస్ కస్టడీని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించగా, జరిగిన ఎన్కౌంటర్లో గాయాపాలయ్యాడు. ఈ కేసులో పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో భద్రతా సంస్థలు లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి.
నిందితుడు సైఫ్ అన్సారీ అలియాస్ రోహిత్ అనే నిందితుడు కోత్వాలి పోలీస్ స్టేషన్ లో కస్టడీలో ఉండగా బాత్రూమ్ వెళ్తానని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. పోలీసులు అతడిని పట్టుకునే ప్రయత్నంలో ఎన్కౌంటర్ చేశారు. ఈ క్రమంలో సైఫ్ గాలికీ బుల్లెట్ గాయమైంది. వెంటనే అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. జూన్ 16న రాత్రి రాంచీలోని చుటియా ప్రాంతంలో ఉన్న ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై సైఫ్ అన్సారీతో పాటు అమన్ అన్సారీ, సయామ్ సుజన్ అనే నిందితులు బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో అమన్ అన్సారీ ప్రధాన సూత్రధారి అని పోలీసులు అనుమానిస్తున్నారు.
ముగ్గురు నిందితులు జార్ఖండ్కు చెందిన వారే అని గుర్తించారు. ఇందులో ఒకరు రాంచీకి చెందిన వాడు కాగా, మరో ఇద్దరు లోహార్దగా జిల్లాకు చెందినవారు. సోషల్ మీడియా ద్వారా ప్రభావితమై ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. దాడికి ముందు కార్యాలయం ముందు రెక్కీ నిర్వహించి, వీడియో చిత్రీకరించినట్లు తెలిసింది. నిందితులుకు పాకిస్తాన్ ఐఎస్ఐతో పాటు గ్యాంగ్స్టర్ షెహజాద్ భట్టి నెట్వర్క్తో సంబంధాలు ఉన్నాయా.? అనే కోణంలో విచారణ జరుగుతోంది. నిందిుతల్లో ఒకడు ఆరు నెలలు దుబాయ్లో ఉన్నట్లు, అక్కడే అనుమాని నెట్వర్క్తో పరిచయమైనట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. రానా సాహిబ్ అనే వ్యక్తి పెట్రోల్ బాంబుల తయారీ చేసే వీడియోలు పంపినట్లు విచారణలో తేలింది.




