Nitin Nabin: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) శనివారం జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. నీట్ పేపర్ లీక్పై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే, బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ సీజేపీపై పరోక్ష విమర్శలు చేశారు. భారత్ యువతను డిజిటల్ ప్రచారాలతో తప్పుదారి పట్టించే ప్రయత్నాలను దేశం సహించదని అన్నారు. విదేశాల్లో కూర్చోని భారత యువతను ఆడించలేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జార్ఖండ్లోని రాంచీలో పార్టీ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, దేశ యువతను ప్రతికూల రాజకీయాల వైపు మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, కానీ భారత యువత సానుకూల రాజకీయాలను మాత్రమే విశ్వసిస్తుందని చెప్పారు. విదేశీ గడ్డపై నుంచి కొందరు భారత యువతకు దిశానిర్దేశం చేస్తారని భావిస్తున్నారని, అయితే, భారత యువత గ్రామాల్లో రైతులతో కలిసి జీవిస్తోంది, కోచింగ్ సెంటర్లలో, కాలేజీల్లో దేశ భవిష్యత్తు నిర్మాణం అవుతోంది, కొందరి చేతుల్లో కీలుబొమ్మలుగా మారే పరిస్థితి లేదని చెప్పారు. ఇదే సమయంలో డిజిటల్ మీడియా దేశాభివృద్ధికి ఉపయోగపడాలని, యువతను గందరగోళంలోకి నెట్టే సాధనం కాకూడదని ఆయన అఅన్నారు.




