Home Minister Anitha: మరోసారి ప్రతిపక్షంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు హోం మంత్రి వంగలపూడి అనిత.. “మావిగన్ పేరు ఎత్తితేనే ప్రజలు నవ్వుకుంటున్నారు” అంటూ వైసీపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కార్యక్రమాల కంటే మాటలకే ప్రాధాన్యత ఇచ్చారని ఆమె విమర్శించారు. వైసీపీ పాలనలో కనీసం ఒక ఫైర్ ఇంజన్ కూడా కొనుగోలు చేయలేదని ఆమె ఆరోపించారు. ప్రజా భద్రత వంటి ముఖ్య అంశాలను నిర్లక్ష్యం చేశారని పేర్కొన్నారు. తప్పు చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Read Also: TTD Laddu Sales Record: లడ్డూ ప్రసాదం విక్రయాల్లో టీటీడీ రికార్డు..
గతంలో అవగాహనలేని నాయకులు ఇష్టానుసారం వ్యవహరించి కోర్టుల నుంచి ఎదురుదెబ్బలు తిన్నారని అనిత వ్యాఖ్యానించారు. ఇకపై అలాంటి పరిస్థితులు రాకుండా కూటమి ప్రభుత్వం జాగ్రత్తగా ముందుకు సాగుతోందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వంటి నాయకుల మార్గదర్శకత్వంలో విజ్ఞతతో నిర్ణయాలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ చట్టబద్ధంగా మాత్రమే పనిచేస్తుందని, ఎక్కడా నిర్లక్ష్యానికి తావివ్వదని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి, అత్యాధునిక సౌకర్యాలను కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా ఏలూరులో మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని కొత్త మహిళా పోలీస్ స్టేషన్ను ప్రారంభించడం ఆనందంగా ఉందని మంత్రి అనిత పేర్కొన్నారు. మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఈ దిశగా మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత..




