Ex-Terrorist: పాకిస్తాన్, ఉగ్రవాదం గురించి మాజీ కాశ్మీరీ ఉగ్రవాది, భారత సైన్యానికి అండర్ కవర్ ఆపరేటివ్గా పనిచేసిన ముస్తాక్ అహ్మద్ భట్ సంచలన విషయాలు వెల్లడించారు. ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. పాకిస్తాన్ నుంచి వచ్చిన విదేశీ ఉగ్రవాదులు తమను తాము ‘‘ముజాహిదిన్లు’’గా చెప్పుకున్నప్పటికీ వారి అసలు లక్ష్యాలు వేరేగా ఉండేవని వెల్లడించారు. ఎన్కౌంటర్లలో హతమైన ఉగ్రవాదుల వద్ద నుంచి ఇంగ్లీష్, హిందీ, ఉర్దూలలో రాసిన ప్రేమ లేఖలు లభ్యమైనట్లు వెల్లడించారు. ఆ లేఖల్లో మత పరమైన పోరాటం కన్నా, కాశ్మీరీ అమ్మాయిలను వలలో ఎలా వేయాలనే ప్రయత్నాలు కనిపించినట్లు చెప్పాడు. తప్పుడు ప్రేమ, భావోద్వేగాలతో కొందరు యువతులను వలలో వేయడానికి ప్రయత్నించినట్లు ఆరోపించాడు.
ఇదే కాకుండా పలు ఎన్కౌంటర్లలో ఉగ్రవాదులు మరణించిన తర్వాత వారి వద్ద కండోమ్ వంటి వస్తువులు లభించాయని ముస్తాక్ వెల్లడించారు. వాటి గురించి ప్రశ్నించినప్పుడు చాలా మంది ఉగ్రవాదుల సరైన సమాధానాలు ఇవ్వలేదని చెప్పాడు. దక్షిణ కాశ్మీర్లో కొన్ని ప్రాంతాల్లో ఉగ్రవాదులు స్థానిక ఇళ్లలో ఆశ్రయం పొందుతూ, అక్కడి యువతులతో రిలేషన్ పెట్టుకున్నారని కూడా చెప్పాడు. ఈ పరిణామాలు ఇప్పటికీ ఆ కుటుంబాలపై ప్రభావం చూపిస్తున్నాయని వెల్లడించారు.
పాకిస్తాన్ ప్రోత్సహించిన ఉగ్రవాదం వల్ల కాశ్మీర్లో అనేక కుటుంబాలు నష్టపోయాయని, స్థానిక యువత తప్పుదారిలో నడిచే పరిస్థితులు ఏర్పడ్డాయని ముస్తాక్ అహ్మద్ భట్ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదం వల్ల అత్యధికంగా నష్టపోయేది సాధారణ ప్రజలేనని ఆయన అన్నారు. ఇదే కాకుండా దురంధర్ సినిమాలో పాకిస్తాన్లో భారత కరెన్సీని ముద్రించినట్లు చూపించడం నిజమే అని చెప్పాడు. దక్షిణ కాశ్మీర్లో ఆ కరెన్సీ నోట్లతో సగం తానే పంపిణీ చేసినట్లు ఒప్పుకున్నాడు.




