దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో ప్రారంభమైంది. గత రెండ్రోజులు మార్కెట్ భారీ లాభాల్లో ట్రేడ్ అయింది. తాజాగా ఇరాన్-అమెరికా మధ్య నిరవధిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ట్రంప్ పొడిగించారు. దీంతో మార్కెట్ మంచి జోష్లో ఉండాలి. కానీ అందుకు భిన్నంగా బుధవారం మార్కెట్ ప్రారంభమే నష్టాలతో మొదలైంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గినప్పటికీ… అంతర్జాతీయంగా బలహీనమైన సంకేతాలు ఉండడంతో పెట్టుబడిదారుల్లో నిరుత్సాహం ఏర్పడింది. దీంతో మార్కెట్ సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: పహల్గామ్ ఉగ్ర బాధితులకు మోడీ నివాళి
ప్రస్తుతం సెన్సెక్స్ 519 పాయింట్లు నష్టపోయి 78,753 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 132 పాయింట్లు నష్టపోయి 24, 444 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీలో ట్రెంట్, నెస్లే, హెచ్యూఎల్, అదానీ ఎంటర్ప్రైజెస్, జియో ఫైనాన్షియల్ వంటి ప్రధాన షేర్లు లాభపడగా.. హెచ్సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వంటి షేర్లు నష్టపోయాయి. నిఫ్టీ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు ఫ్లాట్గా ట్రేడవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Trump: చర్చలకు ఇరాన్ నిరాకరణ.. చేసేదేమీలేక కాల్పుల విరమణ పొడిగించిన ట్రంప్.. అంతర్జాతీయంగా తీవ్ర చర్చ




