CEC Gyanesh Kumar: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన మొత్తం 193 మంది ఎంపీలు రెండు సెట్ల నోటీసులపై సంతకాలు చేశారు. సంతకాలు చేసిన వారిలో 130 మంది లోక్ సభ, 63 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. శుక్రవారం పార్లమెంట్ లోని ఏదో ఒక సభలో నోటీసులు సమర్పించే అవకాశం ఉంది. అయితే, ఎంపీలు ఏ సభలో ముందులగా నోటీసులు ఇస్తారనే దానిపై స్పష్టత లేదు.
Read Also: Subramaniya Bharathi: రోజూ కూలీ కుమారుడు.. తొలి ప్రయత్నంలోనే UPSC క్లియర్.. ఇన్స్పైర్ స్టోరీ..!
నిబంధనల ప్రకారం, లోక్సభలో CECని తొలగించాలని కోరుతూ కనీసం 100 మంది ఎంపీలు నోటీసుపై సంతకం చేయాలి. రాజ్యసభ నుంచి అయితే 50 మంది సభ్యుల బలం ఉండాలి. ఈ నోటీసులు సమర్పిస్తే, ఇలా ప్రధాన ఎన్నికల కమిషనర్ను తొలగించాలని కోరుతూ నోటీసులు ఇవ్వడం ఇదే మొదటిసారి అవుతుంది.




