తమిళ అగ్ర కథానాయకుడు, ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీ స్థాపించి రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాలనుకుంటున్న దళపతి విజయ్కు ఊహించని వ్యక్తిగత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు తన భార్య సంగీత విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన తరుణంలో, ఇప్పుడు తన కుమారుడు జాసన్ సంజయ్ తీసుకున్న ఒక నిర్ణయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
Also Read : Sanju Samson : సంజు శాంసన్పై మలయాళ స్టార్ హీరో ప్రశంసలు
విజయ్ తన భార్య సంగీతకు దూరంగా ఉంటున్నారని, వారి మధ్య తీవ్ర మనస్పర్థలు ఉన్నాయని గత కొంతకాలంగా వినిపిస్తున్న వార్తలకు ఈ పరిణామం మరింత బలాన్ని చేకూర్చింది. సంగీత తన పిటిషన్లో విజయ్పై తీవ్రమైన ఆరోపణలు చేసింది. విజయ్ కు వేరే మహిళతో అక్రమ సంబంధం ఉందని పేర్కొంటూ విడాకులు కోరింది. ఈ క్రమంలో తన తల్లికి అండగా నిలబడేందుకే జాసన్ సంజయ్ మరొక షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. జాసన్ సంజయ్ తన తండ్రి విజయ్ ను ఇన్స్టాగ్రామ్ లో అన్ఫాలో చేయడం అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒక తండ్రిగా విజయ్కు ఇది కొంత బాధాకరమైన విషయమే అయినప్పటికీ, ఆయన అభిమానులు మాత్రం తమ నాయకుడికి అండగా నిలుస్తున్నారు. వ్యక్తిగత జీవితంలో ఇన్ని ఆటంకాలు ఎదురవుతున్నా, విజయ్ తన రాజకీయ లక్ష్యంపై దృష్టి సారించడం విశేషం. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ‘TVK’ పార్టీని బలోపేతం చేసే పనిలో ఆయన నిమగ్నమయ్యారు. “తమిళ ప్రజల సంక్షేమం కోసం, తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాల కోసం విజయ్ చూపిస్తున్న అంకితభావం అభినందనీయం” అని ఆయన మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా పోస్ట్లు పెడుతున్నారు. విజయ్ తన వ్యక్తిగత మరియు వృత్తిపరమైన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని వారు కోరుకుంటున్నారు. ఈ కఠిన పరిస్థితులు విజయ్ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.




