Nepal: నేపాల్ కొత్త ప్రధానమంత్రిగా ఇటీవల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బాలేంద్ర షా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. పూర్తిగా హిందూ సంప్రదాయం ఉట్టిపడేలా ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. శంఖారావాలు, గంటుల, వేద మంత్రాల మధ్య బాలెంద్ర షా ప్రధాని పీఠాన్ని అధిరోహించనున్నారు. ఇప్పటికే, ప్రమాణస్వీకార కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇదిలా ఉంటే , బాలేంద్ర ప్రమాణస్వీకారం శ్రీరామ నవమి రోజు జరుగుతోంది. ఇదే రోజు అయోధ్యంలో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు జరుగుతాయి.
Read Also: LPG Crisis: కష్టకాలంలో మిత్రదేశం సాయం.. 20,000 కి.మీ దూరం నుంచి భారత్కు LPG..
శుక్రవారం ప్రమాణస్వీకారానికి శుభమైన రోజుగా నిర్ణయించారు. స్థానిక కాలమానం ప్రకారం..మధ్యాహ్నం 12:44 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. రామ నవమి సందర్భంగా అయోధ్యలోని రామ మందిరంలో కూడా ఇదే సమయంలో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. పంచాంగంలోని శుభముహూర్తాలను చూసి ప్రమాణస్వీకార సమయాన్ని నిర్ణయించినట్లు కాబోయే ప్రధాని అనుచరులు చెప్పారు. 108 మంది వేద పండితులు వేద మంత్రాలను పఠిస్తుండగా, 107 మంది బౌద్ధ గురువులు ఆశీర్వచనాలు ఇస్తున్న సమయంలో బాలేంద్ర ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు.




