Narayanpet: నారాయణపేట జిల్లాలోని మద్దూరు మండలం ఎంపీహెచ్ఎస్ మోమినాపూర్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థినితో ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ అంశంపై తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్థానిక సర్పంచ్ భర్త విద్యార్థిని శీలానికి రూ. 20 లక్షలు వెలకట్టారట. అసలు ఏం జరిగిందంటే.. మోమినపూర్ లోని జిల్లా పరిషత్ పాఠశాలలో స్వామి అనే ఉపాధ్యాయుడు ఓ మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు రాకుండా సర్పంచ్ భర్త గొల్ల రవి కుమార్ రూ. 20 లక్షలకు సెటిల్మెంట్ చేశాడు. ఈ వ్యవహారం తెలిసినప్పటి నుంచి బయట వ్యక్తులకు తెలియకుండా ఉండేందుకు సహచర ఉపాధ్యాయులు గురునాథ్ రెడ్డి, కర్ని చెన్న కేశవులు ప్రయత్నించారు. కానీ.. ఒప్పందం ప్రకారం ఉపాధ్యాయుడు డబ్బులు ఇవ్వకపోవడంతో వీడియో బయటకు లీక్ చేశారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో పోలీసుల పోక్సో, ఐటీ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదు చేసి మొత్తం ఏడుగురిని పోలీసులు రిమాండ్కు తరలించారు. పోలీసుల విచారణలో ఈ సంచలన విషయాలు బయటకు వచ్చాయి.
READ MORE: Gold Rates: యుద్ధం వేళ మగువలకు శుభవార్త.. దిగొచ్చిన బంగారం ధరలు




