టాలీవుడ్ డార్లింగ్ మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం అడివి శేష్తో కలిసి నటించిన ‘డెకాయిట్’ (Dacoit) ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఈ క్రమంలో రణ్వీర్ అల్లాబాడియా పాడ్కాస్ట్లో పాల్గొన్న ఆమె, బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్పై తనకున్న కృతజ్ఞతను చాటుకుంది.‘రణ్వీర్ నా లక్కీ చార్మ్. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం ఆయనే. కెరీర్ మొదట్లో ఆయనతో కలిసి ఒక హెయిర్ బ్రాండ్ కమర్షియల్ యాడ్లో నటించాను. ఆ యాడ్ చూశాకే ఫిల్మ్ మేకర్స్ నన్ను గుర్తించడం మొదలుపెట్టారు’ అని మృణాల్ తన సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంది.
Also Read : Trump: ప్రపంచానికి ఈరోజు గొప్ప రోజు.. స్వర్ణయుగం రాబోతుందన్న ట్రంప్
ఇక రణ్వీర్ సింగ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘ధురంధర్ 2’ గురించి మాట్లాడుతూ.. ‘సినిమా చూస్తున్నంత సేపు నాకు రణ్వీర్ కనిపించలేదు, కేవలం ‘హమ్జా’ పాత్ర మాత్రమే కనిపించింది. ఆయన పడే కష్టానికి ఈ రూ. 1600 కోట్ల విజయం దక్కడం నాకు చాలా గర్వంగా ఉంది’ అని ప్రశంసించింది. కేవలం 20 రోజుల్లోనే రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ‘బాహుబలి 2’ రికార్డులను సైతం బద్దలు కొట్టిన రణ్వీర్, తన కెరీర్లో అండగా నిలిచిన తీరును మృణాల్ ఎంతో గొప్పగా వివరించింది. ఏప్రిల్ 10న విడుదల కాబోతున్న ‘డెకాయిట్’ చిత్రంలో మృణాల్ మరోసారి తన నటనతో మ్యాజిక్ చేయడానికి సిద్ధమైంది. అడివి శేష్ హీరోగా, అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో వస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ పై భారీ అంచనాలు ఉన్నాయి.




