Meerut Murder: మీరట్ మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్పుత్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. జైలులో ఉన్న ప్రధాన నిందితురాలు సౌరభ్ భార్య ముస్కాన్ గర్భవతిగా నిర్ధారణ అయింది. జైలు అధికారుల అభ్యర్థన మేరకు జిల్లా ఆస్పత్రి నుంచి ఒక టీమ్ సోమవారం జైలులో ఆమెకు పరీక్షలు చేసింది. ఈ పరీక్షల్లో ముస్కాన్ రస్తోగి గర్భవతి అని తేలింది. చీఫ్ మెడికల్ ఆఫీసర్ అశోక్ కటారియా ముస్కాన్ ప్రెగ్నెన్సీని ధ్రువీకరించారు.
Read Also: Waqf Act: “వక్ఫ్ చట్టం”పై సుప్రీంకోర్టుకు డీఎంకే, ముస్లిం లా బోర్డ్..
గత నెలలో మీరట్ మర్డర్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. విదేశాల్లో ఉన్న సౌరభ్ రాజ్పుత్(29) తన కుమార్తె పుట్టిన రోజు కోసం భారత్ వచ్చిన సమయంలో, అతడి భార్య ముస్తాన్ రస్తోగి(27), ఆమె ప్రియుడు సాహిల్ శుక్లా(25) కలిసి దారుణంగా హత్య చేశారు. కత్తితో పొడిచి, గొంతు కోసి హతమార్చారు. ఆ తర్వాత డెడ్ బాడీని 15 ముక్కలుగా చేసి డ్రమ్లో పెట్టి, సిమెంట్తో కప్పేశారు.
హత్య తర్వాత ముస్తాన్, సాహిల్ కలిసి విహారయాత్రలకు వెళ్లారు. అయితే, సౌరభ్ కనిపించడం లేదని అతడి కుటుంబం ఫిర్యాదు చేయడంతో ఈ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ముస్కాన్, సౌరభ్ 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. గత మూడేళ్లుగా ఐదేళ్ల కుమార్తెతో ఆమె అద్దె ఇంట్లో నివసిస్తోంది. సౌరభ్ లండన్లో పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ముస్కాన్, సాహిల్ మధ్య ప్రేమ వ్యవహారం మొదలైంది. డ్రగ్స్కి బానిసైన ఇద్దరు సౌరభ్ని అడ్డు తొలగించుకోవడానికి దారుణహత్యకు పాల్పడ్డారు.