Kakinada Road Accident: కాకినాడలో జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరు మహిళల ప్రాణాలు తీసింది.. సర్పవరం జాతీయ రహదారి వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వెంకట పద్మవతి మరియు దీప్తి అనే ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. వీరు విశాఖపట్నం నుండి కాకినాడకు వెళ్తుండగా.. డ్రైవర్ గూగుల్ మ్యాప్లో సూచించిన షార్ట్కట్ రూట్ను అనుసరించగా ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు..
Read Also: HYD SPA VYABHICHARAM: మసాజ్ థెరపిస్టుల పేరుతో యువతుల నియామకం.. క్రాస్ మసాజ్ చేయుస్తున్న ముఠాలు
ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, కారు వెనక నుండి వచ్చిన టిప్పర్ లారీ బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో మరో ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలపాలయ్యారు.. కాకినాడ జీజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. ప్రాణాలతో బయటపడిన డ్రైవర్ ప్రదీప్ చెప్పారు, గూగుల్ మ్యాప్ షార్ట్కట్ చూపించడం వల్ల సాధారణ రూట్ కాకుండా వెళ్ళడంతో ప్రమాదం జరిగిందని అని చెబుతున్నారు.. ఈ ఘటనా క్రమంలో, స్థానిక ప్రజలకు గూగుల్ మ్యాప్ షార్ట్కట్స్ వాడేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది.




