Iran Israel Conflict: పశ్చిమాసియా సంక్షోభం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. అమెరికా, ఇజ్రాయిల్ దాడులతో వారంలోనే ఇరాన్ సరెండర్ అవుతుందని అంతా భావించారు, కానీ ఇరాన్ గల్ఫ్లోని అమెరికా మిత్రదేశాలైన యూఏఈ, బహ్రైయిన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియాపై విరుచుకుపడుతోంది. ఇజ్రాయిల్పై మిస్సైళ్లతో అటాక్ చేస్తోంది.
Read Also: Pakistan: “మమ్మల్ని ఖతార్ అనుకుంటున్నావా”, ఇజ్రాయిల్కు పాక్ వార్నింగ్.. దాడులతో కలవరం..
ఇరాన్ ఇజ్రాయిల్పైకి ప్రయోగించిన ఓ క్షిపణి ప్రస్తుతం వైరల్ అవుతోంది. క్షిపణిపై ‘‘థాంక్యూ ఇండియా’’ అంటూ భారత ప్రజలకు థాంక్స్ చెబుతున్న సందేశం ఉంది. ఈ మెసేజ్ ఉన్న క్షిపణితో ఇజ్రాయిల్పై ఇరాన్ దాడి చేసింది. ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్, ఇరాన్ ప్రభుత్వం దీనికి సంబంధించిన ఫోటోలను విడుదల చేసింది. ఇరాన్ ఏరోస్పేస్ ఫోర్స్కు చెందిన సిబ్బంది ప్రయోగానికి ముందు నీలిరంగు మార్కర్లను ఉపయోగించి క్షిపణులపై “భారత ప్రజలకు ధన్యవాదాలు” వంటి సందేశాలను రాస్తున్నట్లు కనిపిస్తుంది.
ఇరాన్ ఇలాగే స్పెయిన్, పాకిస్తాన్, జర్మనీ లోని ప్రజలకు కూడా థాంక్స్ చెప్పింది. తమకు మద్దతు తెలిపిన దేశాలతో పాటు స్నేహపూర్వక దేశాల ప్రజలను ఉద్దేశిస్తూ ఇరాన్ ఇలా కృతజ్ఞతలు చెబుతోంది. సంఘర్షణ సమయంలో ఇరాన్, భారత్ను తన మిత్రదేశంగా కొనియాడింది. హార్ముజ్ జలసంధి భారత్కు ఓపెన్ చేసి ఉంటుందని ప్రకటించింది. ఇటీవల, కాశ్మీర్ ప్రజలు ఇరాన్ కోసం విరాళాలు సేకరించారు. ఈ సాయం గురించి ఇరాన్ భావోద్వేగ పోస్ట్ పెట్టింది.
Iran launches WAVE 83 missile AND drone attack on ‘Zionist soldiers’ — IRIB
THANK YOUS written on missiles in English to people across globe pic.twitter.com/wjjVietkAo
— RT (@RT_com) March 26, 2026




