IND vs PAK: టీ20 వరల్డ్ కప్లో భారత్- పాకిస్థాన్ మధ్య జరిగే హై వోల్టేజ్ మ్యాచ్కు ముందు టీమిండియాలో మార్పులపై ఆసక్తికర చర్చ మొదలైంది. మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్తో జరిగే మ్యాచ్లో పేసర్ అర్ష్దీప్ సింగ్ స్థానంలో లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను తీసుకునే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎందుకంటే, నమీబియాతో జరిగిన మ్యాచ్లో అర్ష్దీప్ భారీగా పరుగులు ఇచ్చాడు. నాలుగు ఓవర్లు పూర్తి చేయలేదని గుర్తు చేశారు. మిగతా బౌలర్లు వికెట్లు సాధించారు. ఈ పరిణామాలు పాకిస్థాన్ మ్యాచ్ ని దృష్టిలో పెట్టుకుని జట్టు వ్యూహం మార్చవచ్చనే సంకేతాలు ఉన్నాయని గవాస్కర్ చెప్పారు.
అయితే, శ్రీలంక పిచ్లు స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటాయని, భారత్ ముగ్గురు స్పిన్నర్లతో ఆడిన చరిత్ర ఉందని సునీల్ గవాస్కర్ గుర్తు చేశారు. కొలంబోలో జరిగే పాక్ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ ప్లేయింగ్ ఎలెవన్లో ఉంటాడని అంచనా వేశారు. ఇక, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ మార్పులు కూడా దాయాది జట్టును దృష్టిలో పెట్టుకుని చేశారని ఆయన విశ్లేషించారు. హార్దిక్ పాండ్యా మొదటి ఓవర్ వేయడం అర్ష్దీప్ స్థానంపై సందేహాలు వస్తున్నాయి. అలాగే, వరుణ్ చక్రవర్తి నాలుగు ఓవర్లు వేసి ఉంటే ఐదు లేదా ఆరు వికెట్లు తీసేవాడని పేర్కొన్నారు. అక్షర్ పటేల్ మూడు ఓవర్లలో రెండు వికెట్లు తీయడం కూడా మంచి పరిణామం అని మాజీ క్రికెటర్ సునీల్ తెలిపారు.
Read Also: Bhopal: ప్రేమికుల రోజున దుర్వార్త.. ప్రేమికురాలిని చంపి సెప్టిక్ ట్యాంక్లో పడేసిన ప్రియుడు
ఇక, బ్యాటర్ సంజూ శాంసన్ ఆటపై కూడా గవాస్కర్ మాట్లాడుతూ.. అనారోగ్యంతో ఉన్న అభిషేక్ శర్మ స్థానంలో వచ్చిన సంజూ, 8 బంతుల్లో 22 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.. అతను క్రీజ్లో చాలా లోతుగా వెళ్లి ఫ్లిక్ షాట్ ఆడడం సాంకేతిక సమస్యగా మారుతోంది.. కొత్త బంతితో ఓపెనింగ్ చేసే సమయంలో మరింత జాగ్రత్తగా ఆడాల్సిన అవసరమని సూచించారు. అయితే, నమీబియా బౌలర్లు సంజూ కోసం ప్రత్యేక ఫీల్డింగ్ సెట్టింగ్ పెట్టారు.. అయినప్పటికీ కొన్ని అద్భుత షాట్లు ఆడటం అతనికి ఆత్మవిశ్వాసం ఇస్తుందన్నారు. పాక్ మ్యాచ్లో అవకాశం వస్తే క్రీజ్లో ఎక్కువ సమయం గడపాలని సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు.




