క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో ఒక సరికొత్త ట్రెండ్ను సెట్ చేసిన ‘దృశ్యం’ సిరీస్ అంతా చూసే ఉంటారు.తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఒక సామాన్యుడు చేసే పోరాటం దేశవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ ఉత్కంఠభరితమైన ప్రయాణానికి ముగింపు పలికే సమయం వచ్చేసింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, డైరెక్టర్ జీతు జోసెఫ్ కాంబినేషన్లో వస్తున్న ఈ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాన్ని.. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్పై ఆంటోనీ పెరుంబవూర్ నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది 2026, ఏప్రిల్ 2న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయబోతున్నట్లు సోషల్ మీడియా ద్యారా అనౌన్స్ చేశారు.
Also Read : Lokesh Kanagaraj : లోకేష్ కనగరాజ్ ‘DC’ సర్ప్రైజ్.. వాలెంటైన్స్ డే నాడు అదిరిపోయే అప్డేట్!
అయితే రెండవ భాగం ముగింపులో జార్జికుట్టి పోలీసులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చి, ఏకంగా పోలీస్ స్టేషన్ కిందనే శవాన్ని పాతిపెట్టి తెలివిగా తప్పించుకుంటాడు. మరి ఈ మూడో భాగంలో పోలీసులు ఆ శవాన్ని వెలికితీస్తారా? జార్జికుట్టి వేసే ఆఖరి మాస్టర్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? అనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. విశేషమేమిటంటే, ఈ సినిమా క్లైమాక్స్ అన్ని భాషల్లోనూ (మలయాళం, హిందీ, తెలుగు) ప్రేక్షకులను అందుబాటులో ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. ఇప్పటికే హిందీలో అజయ్ దేవగన్ షూటింగ్ మొదలుపెట్టగా, తెలుగులో మన వెంకటేష్ కూడా త్వరలోనే షూటింగ్లో పాల్గొననున్నారు. ఏప్రిల్ 2న జార్జికుట్టి కథకు ఒక అదిరిపోయే ముగింపు లభించడం ఖాయం!




