Akarshitha: సూరిశెట్టి కిషోర్ దర్శకత్వంలో త్రిగుణ్ హీరోగా, పదినే కుమార్ హీరోయిన్గా తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘ఆకర్షిత’. లక్కీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈ రోజు ఘనంగా జరిగాయి. ఈ చిత్రాన్ని కోరె సందీప్ యాదవ్, శ్రీకాంత్ బట్టు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ పూజా కార్యక్రమంలో ముహూర్తపు సన్నివేశానికి సి.కళ్యాణ్ క్లాప్ కొట్టగా, ప్రముఖ జ్యోతిశ్య నిపుణులు వేణు స్వామి స్క్రిప్ట్ను అందజేశారు. బేబీ ఆష్కా, కీర్తనలు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నటి ప్రియ చిత్రానికి సంబంధించిన ‘ఆకర్షిత’ టైటిల్ను రివీల్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో త్రిగుణ్, కసిరెడ్డి, సత్యం రాజేష్, అదుర్స్ రఘు, రవివర్మ, ప్రియా పాల్గొని సందడి చేశారు.
READ ALSO: Smriti Mandhana: ప్రేమ విఫలమైనా.. ఆటలో మాత్రం తగ్గేదేలే! ఆర్సీబీకి కప్పు.. ఆసీస్పై సిరీస్!
అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో హీరో త్రిగుణ్ మాట్లాడుతూ.. ‘మంచి సినిమాతో మేమంతా రాబోతోన్నాం. ఈ చిత్రంలో నేను హీరోని కాదు కసిరెడ్డి హీరో. కసిరెడ్డితో పని చేయడం ఆనందంగా ఉంది. ఈ మూవీలో మాతో పాటుగా రవి వర్మ గారు, రఘు గారు, ప్రియా గారు నటిస్తున్నారు. ఈ రోజు మేం మా ‘ఆకర్షిత’ టైటిల్ను రివీల్ చేశాం. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం. ఇతర అప్డేట్లు త్వరలోనే ఇస్తామ’ని అన్నారు. కసిరెడ్డి రాజ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘ఆకర్షిత’ కథను రెండేళ్ల క్రితం విన్నాను. కథ విన్నప్పుడు షాక్ అయ్యాను. ఇందులో అన్ని రకాల అంశాలుంటాయి. ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటుంది. త్రిగుణ్తో ఇది నాకు తొలి చిత్రం. ఇంత మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు. దర్శకుడు సూరిశెట్టి కిషోర్ మాట్లాడుతూ.. ‘మా ‘ఆకర్షిత’ చిత్రం చాలా కొత్తగా ఉంటుందన్నారు.
READ ALSO: Vishwak Sen’s CULT Teaser: ‘కల్ట్’ టీజర్తో విశ్వక్ సేన్ ఊచకోత!




