Asaduddin Owaisi: భారత్తో పాటు ప్రపంచదేశాల్లో ‘‘ధురంధర్-2’’ హవా కొనసాగుతోంది. కలెక్షన్లతో రికార్డులు కొల్లగొడుతోంది. సినిమాపై చాలా మంది ప్రశంసలు కురిపిస్తుండగా, మరోవైపు ఈ సినిమాను విమర్శించే వారు కూడా ఉన్నారు. తాజాగా విమర్శకులు జాబితాలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా చేరారు.టైమ్స్ నౌ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ధురంధర్ 2 సినిమాను ‘‘బక్వాస్’’( చెత్తసినిమా)గా అభివర్ణించారు. సినిమా హింసను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ‘‘అది అసలు సినిమానా?’’ అని ప్రశ్నించారు. మూడు గంటలు అర్థం లేని గారడీ అంటూ కొట్టిపారేశారు.
Read Also: Manchu Lakshmi: ప్రతి రూపాయి ఒక చిన్నారి భవిష్యత్తును మారుస్తుంది
ఆదిత్య ధర్ నిర్మించిన, రణవీర్ సింగ్ నటించిన ఈ సినిమా భారీ సక్సెస్ సాధించిన తరుణంలో ఓవైసీ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ‘‘మూడు గంటలు ఈ సినిమాను చూసేందుకు తనకు సమయం లేదని, ఈ సినిమా ఏం మేసేజ్ ఇస్తుందని, ముస్లింలపై సందేహాలు రెకెత్తించేలా సినిమా రూపొందిచారు’’ అని ఆయన అన్నారు. ఇలాంటి సినిమాలపై దృష్టి పెట్టడం కన్నా వాటిని పట్టించుకోకపోవడానికే ప్రాధాన్యత ఇస్తానని ఓవైసీ అన్నారు.
స్పై యాక్షన్ థ్రిల్లర్గా రూపొందించిన సినిమా పాకిస్తాన్ బ్యాక్డ్రాప్గా కొనసాగుతుంది. కరాచీలోని నేరసామ్రాజ్యం లోని ఇండియన్ ఏజెంట్ ఎంటరవ్వడం, అక్కడి మాఫియాను శాసించడం వంటి అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. IC-814 హైజాకింగ్, భారత పార్లమెంట్ దాడి మరియు ముంబై దాడులు వంటి నిజ జీవిత సంఘటనలు కూడా ఇందులో కనిపిస్తాయి. జియో స్టూడియోస్ మరియు బి62 స్టూడియోస్ నిర్మించిన ‘ధురందర్ 2’ మార్చి 19న విడుదలైంది. ఈ చిత్రం భారతదేశంలో రూ. 715.72 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 1,128 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.గత ఏడాది డిసెంబర్లో విడుదలైన ఒరిజినల్ ‘ధురందర్’ దేశీయంగా రూ. 840 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 1,300 కోట్లకు పైగా వసూలు చేసి, సీక్వెల్పై భారీ అంచనాలను నెలకొల్పింది.




