తెలుగు ప్రేక్షకులకు ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో సుపరిచితమైన నటి అవికా గోర్, ప్రస్తుతం ఒక వైరల్ వీడియో కారణంగా వార్తల్లో నిలిచారు. గత ఏడాది సెప్టెంబర్లో మిలింద్ చాంద్వానీని వివాహం చేసుకున్న ఈ బ్యూటీ, అప్పటి నుండి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను అప్పుడప్పుడు షేర్ చేస్తూనే ఉంది. అయితే, తాజాగా ఆమె ఒక ఈవెంట్లో అస్వస్థతకు గురవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
Also Read : Bhumi Pednekar : హిట్ల కోసం ఆశపడి తప్పు చేశా.. బాలీవుడ్ నటి ఎమోషనల్ స్పీచ్!
అసలు ఏం జరిగింది అంటే.. ఇటీవల ఒక బహిరంగ కార్యక్రమానికి హాజరైన అవికా గోర్, అక్కడి నుండి బయటకు వస్తున్న సమయంలో మీడియా కెమెరాల ముందుకు వచ్చారు. ఆ సమయంలో ఆమె చాలా నీరసంగా, అసౌకర్యంగా కనిపించింది. మీడియా ప్రతినిధులు ఫోటోలు తీస్తుండగానే ఆమెకు అకస్మాత్తుగా వాంతులు అయ్యాయి. దీంతో ఆమె భర్త మిలింద్ వెంటనే అప్రమత్తమై, ఫోటోలు తీయవద్దని మీడియాను కోరుతూ ఆమెను కారులోకి తీసుకెళ్లారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, అవికా గోర్ తల్లి కాబోతోందనే వార్తలు ఊపందుకున్నాయి.
‘ఇది కచ్చితంగా ప్రెగ్నెన్సీ లక్షణమే, అవికా గుడ్ న్యూస్ చెప్పబోతోంది’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఆమెకు ముందస్తు శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు. అయితే, గతంలో కూడా ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు అవికా వాటిని కొట్టిపారేశారు. తాజాగా జరిగిన ఈ ఇన్సిడెంట్పై ఆమె కానీ, ఆమె టీమ్ కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. అది కేవలం అనారోగ్యమా లేక నిజంగానే ‘వారసుడు’ రాబోతున్నాడా అనేది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.




