Ukraine War: ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. కీవ్ సమీపంలోని బుచా జిల్లాలో 27 మంది మరణించారు. ఈ దాడుల్లో 50 ఇళ్లు దెబ్బతిన్నాయని స్థానిక అధికారులు తెలిపారు. దాడుల కారణంగా భారీ అగ్ని ప్రమాదం జరిగిందని, పలుచోట్ల నివాసాలు దెబ్బతిన్నట్లు చెప్పారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడుతూ.. మైలా గ్రామంలోని ఓ గోదాముపై దాడి జరిగిందని, తర్వాత భారీ పేలుడు సంభవించిందని తెలిపారు. అయితే, ఆ ప్రాంతంలో ఎలాంటి పేలుడు సామాగ్రి ఉంచారనే దానిపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు. నివాస ప్రాంతాల్లో మందుగుండు సామాగ్రి చేయడంపై నిల్వ సంబంధిత అధికారులపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు చెప్పారు. ఇప్పటికే 370 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
వరసగా మూడు రోజుల నుంచి కీవ్ను రష్యా టార్గెట్ చేస్తోంది. రాజధాని ప్రాంతంపై రష్యా నిరంతరం వైమానిక దాడులు చేస్తోంది. దీంతో నగరంలో జనజీవితం అస్తవ్యస్తమైంది. ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. రష్యా, ఉక్రెయిన్లో ఇటీవల కాలంలో ఒకరిపై ఒకరు భారీ దాడులకు పాల్పడుతున్నారు. దీంతో మరణాల సంఖ్య పెరుగుతోంది. ఈ యుద్ధం ప్రారంభమై నాలుగున్నరేళ్లు దాటినప్పటికీ, ఇరు దేశాల మధ్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.




