కాంగ్రెస్ అగ్ర నేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ ఆటో అవతారమెత్తారు. శుక్రవారం ఢిల్లీలో ఆటో డ్రైవర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఢిల్లీలోని బెంగాలీ మార్కెట్ ప్రాంతంలోని తోడర్మల్ పార్క్లో ఆటో డ్రైవర్లతో సమావేశమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సమస్యలను పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఆటో డ్రైవర్ యూనిఫామ్ ధరించి కనిపించారు. చిన్నారులతో సెల్ఫీలు దిగుతూ అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం ఆటో డ్రైవర్లతో కలిసి భోజనం చేశారు.
ఆటో డ్రైవర్ రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ.. తమ వ్యాపారం మందగించిందని.. పెరుగుతున్న ఖర్చులతో జీవనం కష్టంగా మారిందని రాహుల్ గాంధీకి వివరించామని తెలిపారు. తమ పిల్లల చదువు, రోజువారీ ఆదాయం, కుటుంబ పోషణ గురించి కూడా రాహుల్ అడిగి తెలుసుకున్నారని చెప్పారు. “మేమంతా కలిసి దాల్, రోటీ, కూరతో సాధారణ భోజనం చేశాం” అని రమేష్ ప్రసాద్ తెలిపారు. మరో ఆటో డ్రైవర్ అరిందర్ కుమార్ షా మాట్లాడుతూ.. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ముఖ్యంగా గ్యాస్ ధరల పెరుగుదల వల్ల జీవనం చాలా కష్టమైందని రాహుల్ గాంధీకి వివరించామని చెప్పారు.
“ఆటో డ్రైవర్ల సమస్యలకు మద్దతుగా నిలుస్తానని, మా సమస్యలను నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ ముందు పార్లమెంట్లో ప్రస్తావిస్తానని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. మేమంతా కలిసి రోటీ, బీహార్ స్టైల్ ఆలూ కీ సబ్జీతో భోజనం చేశాం” అని ఆనందం వ్యక్తం చేశాడు.
#WATCH | Delhi: Congress leader and Lok Sabha LoP Rahul Gandhi was spotted outside his residence wearing an auto‑rickshaw driver’s uniform. He interacted with auto‑rickshaw drivers and even shared a meal with them during the conversation. pic.twitter.com/QsHLOJzyjN
— ANI (@ANI) May 29, 2026
VIDEO | Delhi: Lok Sabha LoP Rahul Gandhi (@RahulGandhi) interacts with auto drivers at Todarmal Park, Bengali Market.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/ibe97tCYTQ
— Press Trust of India (@PTI_News) May 29, 2026




