AIADMK: తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. అన్నాడీఎంకే పార్టీలో వర్గపోరు ముదిరిపోయింది. ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్), సీనియర్ నాయకుడు సీవీ షణ్ముగం వర్గాల మధ్య తీవ్ర పోరు నెలకొంది. శనివారం రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. విల్లుపురం, కడలూరు లోని పార్టీ కార్యాయాల వెలపల ఘర్షణ జరిగింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Read Also: CM Vijay: తమిళనాడు కొత్త కేబినెట్ ప్రకటించిన విజయ్.. ఎవరికి ఏ శాఖ?
విల్లుపురంలో, కొత్తగా నియమితులైన జిల్లా కార్యదర్శి పశుపతి ఏఐఏడీఎంకే పార్టీ కార్యాలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. సీవీ షణ్ముగం వర్గానికి చెందిన కార్యకర్తలు, నేతలు ఆయన ప్రవేశాన్ని వ్యతిరేకించడంతో గొడివ ప్రారంభమైంది. రెండు వర్గాల మధ్య తోపులాట నెలకొంది. పశుపతి వర్గానికి చెందిన వారు పోలీసుల రక్షణ కోరుతూ, పార్టీ ఆఫీస్ తాళాలు తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గొడవ పెద్దది కావడంతో రెండు వర్గాలను పోలీసులు లోపలకి అనుమతించలేదు.
ఇక కడలూరులో కూడా అన్నాడీఎంకే కార్యాలయం వద్ద ఇలాంటి ఘర్షణ జరిగింది. షణ్ముగం వర్గం ఆఫీసుకు తాళాలు వేసింది. దీనికి ప్రతిస్పందనగా ఈపీఎస్ వర్గం తాళాలను పగలగొట్టి ప్రవేశించే ప్రయత్నం చేశారు. కరూర్తో సహా మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘర్షణలే చోటుచేసుకున్నాయి. అన్నాడీఎంకేలో షణ్ముగం, వేలుమణి వర్గానికి చెందిన 27 మంది ఎమ్మెల్యేలు విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంతో పార్టీలో సంక్షోభం ఏర్పడింది. రెండు వర్గాల కారణంగా అన్నాడీఎంకే చీలిపోయింది.




